మహేష్ బాబు , దర్శకుడు లింగు స్వామి కాంబినేషన్ గురించి గత కొద్ది రోజులుగా వినపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం పట్టాలు ఎక్కటానికి పూర్తి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. లింగుస్వామి రీసెంట్ గా మహేష్ ని కలిసి కథని నేరేట్ చేసారు. కథ విన్న వెంటనే మహేష్..సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ చిత్రం తమిళంలో వెట్టై(తెలుగులో వేట కావచ్చు) పేరుతో మొదలవుతోంది. మాధవన్, ఆర్య లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇది బై లింగువల్ చిత్రంగా రూపొందనుంది. తమిళంలో ఆర్య చేసే పాత్రను తెలుగులో మహేష్ చేస్తారు. మాధవన్ రెండూ చోట్లా ఆయనే చేస్తారు. ఇక ఈ చిత్రం ఇద్దరి అన్నదమ్ముల కథగా నడుస్తుంది. ఇందులో మాధవన్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు.
తమిళంలో దయానిధి అళగిరి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. క్లౌడ్ నైన్ మూవీస్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. యవన్ శంకర్ రాజా సంగీతం, నీరవ్ షా కెమెరా, ఎడిటింగ్ ఆంధోనీ గోస్వామి చేస్తారు. డిసెంబర్ 2010 లో చిత్రం షూటింగ్ మొదలై మే 2011 లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని కె.ఎల్.నారాయణ తమ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తారు. మహేష్ సోదరి మంజుల తమ ఇందిరా ప్రొడక్షన్స్ తో సహ నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఇక మహేష్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో కమిటయిన దూకుడులో బిజీ అయ్యారు. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా చేస్తున్నారు. ఇదేకాక మెహర్ రమేష్ దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే చిత్రంలో నటించడానికి అంగీకారం తెలిపాడు.
No comments:
Post a Comment